Tuesday, January 31, 2012

2040 లో 50 రాష్ట్రాలు మరియు 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో భారతదేశ చిత్ర పటం... అవుట్ లుక్ పత్రిక ఆసక్తికర కథనం...!!!



                
        1953 లో ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అప్పట్లో మన దేశంలోని రాష్ట్రాలను పునర్విభజన చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంది. 14 రాష్ట్రాలను 9 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి ఈ కమిషన్ 38,000 మైళ్ళ దూరం ప్రయాణించి, 104 ప్రాంతాలను పర్యటించి దాదాపు 1,50,000 డాక్యుమెంట్లను పరిశీలించింది. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులతో పుట్టుకొస్తున్న కొత్త కొత్త రాష్ట్రాల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అవుట్ లుక్ పత్రిక న్యూస్ రూం లో కొత్త రాష్ట్రాలతో భారత దేశ చిత్రపటాన్ని తయారు చేయాలనే ఒక మంచి ప్రయత్నం జరిగింది. అవుట్ లుక్ పత్రిక వాళ్ళు భాషా పరంగా, సంస్కృతి పరంగా, అలాగే ఆయా రాష్ట్రాల భౌగోళిక స్వరూపం దృష్ట్యా  ఈ రాష్ట్రాలను విభజించడం జరిగింది. ఇది కేవలం ఊహాజనితము మాత్రమే అని ఒక రాష్ట్రాన్ని విడగొట్టమని కాని లేదా కలిపి ఉంచమని చెప్పడానికి కాదని ఆ పత్రికలో పేర్కొన్నారు. 
     
ఈ విషయం పైన పూర్తి సమాచారం కోసం ఈ లింకుని నొక్కండి...Out Look India Website.http://www.outlookindia.com/article.aspx?279691

Source : Outlook FEB 6th 2012 మాగజైన్

1 comment:

  1. Not sure why Only Hyderabad is expected as a union territory ??......:<<>>: Chennai, Mumbai, Kolkata, Bangalore.. none of them expected to be UT.

    ReplyDelete