Wednesday, February 29, 2012

ఒకే ఒక్క తుఫానుతో అదృశ్యం అయి కాలగర్భంలో కలిసిపోయిన ధనుష్కోటి పట్టణం వివరాలు...!!!

                    ప్రతి సంవత్సరం మనం ఎన్నో వాతావరణ మార్పులు చూస్తుంటాం...ఎండలకు కొంతమంది పండుటాకుల్లా రాలిపోతుంటారు. చలికి కొంతమంది జీవితం గడ్డకట్టుకుపోతుంది. తుఫానులకి కొంతమంది ప్రాణాలు నీటిలో కలిసిపోతుంటాయి. సునామీకి ఊర్లు కొట్టుకుపోవడం కూడా చూశాం. కానీ ఒకే ఒక్క తుఫానుకి ఒక మధ్య తరహా పట్టణం చరిత్రలో కలిసిపోవడం ఎపుడయినా చూసారా...!!! కనీసం చదివారా...!!! ఇది ఇప్పటి సంఘటన కాదు... ఈ సంఘటన జరిగినప్పటికీ మనలో చాలా మంది జన్మించి ఉండరు. కొంతమంది చిన్న పిల్లలుగా ఉండి ఉంటారు.  ఈ పట్టణం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా .... అయితే చదివేయండి.


                               ధనుష్కోటి.... చారిత్రాత్మక పట్టణం...స్వామీ వివేకానంద గారు 1892 లో విదేశీ పర్యటనకు వెళ్లి 1897 లో భారత దేశం తిరిగి వచ్చినపుడు ఇక్కడే కాలు మోపాడు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు జన్మించిన పట్టణం కూడా ఇదే. ఈ పట్టణం రామేశ్వరం పంబన్  ద్వీపానికి చిట్ట చివరన ఉంటుంది. ఇక్కడినుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్లు.   ఇక్కడి నుంచే రాముడు శ్రీలంకకు వెళ్ళడానికి వంతెన ఏర్పాటు చేసుకున్నాడని చరిత్ర చెపుతుంది. ఇక్కడ ఇప్పటికీ ఆ వంతెన తాలుకు అవశేషాలను చూడవచ్చు. ఈ వంతెన శాటిలైట్ చిత్రాలలో కూడా స్పష్టంగా కనబడుతుంది ( పైన చిత్రం లో చూడండి ).హిందూ మహా సముద్రం మరియు బంగాళా ఖాతం ఇక్కడే కలుస్తాయి. రెండు సముద్రాల మధ్యన వర్ణ భేదం స్పష్టంగా చూడవచ్చు. అయితే 1964 లో సంభవించిన ఒక తుఫాను ధాటికి ఈ పట్టణం అంతా కనుమరుగయిపోయింది.


అసలు 1964 డిసెంబర్ 22 అర్ధ్రరాత్రి కి ముందు ధనుష్కోటి ఎలా ఉండేది?
                                1964 కి ముందు ధనుష్కోటి పర్యాటక రంగంలో మరియు పుణ్యక్షేత్రంగా ఒక వెలుగు వెలుగుతూ ఉండేది. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 29 కిలోమీటర్ల దూరం కావడం వలన అప్పట్లో పర్యాటకులను,సాధారణ ప్రయాణికులను శ్రీలంక చేరవేయడానికి ఇక్కడినుంచి ఫెర్రీ సర్వీసులు కూడా నడిచేవి. పర్యాటకులకు భక్తులకు వసతి కలిపించడానికి ఇక్కడ    హోటళ్ళు, ధర్మశాలలు, బట్టల దుకాణాలు ఉండేవి. భారత భూభాగం నుంచి పంబన్ రైలు వంతెన మీదుగా ధనుష్కోటి పట్టణం వరకు ఒక రైలు మార్గం కూడా ఉండేది.మద్రాసు పట్టణం నుంచి ధనుష్కోటి వరకు బోట్ మెయిల్ అనే పేరుతో ఒక రైలు కూడా నడిచేది. అలాగే ఒక చర్చి, రైల్వే స్టేషన్, రైల్వే ఆసుపత్రి, ఉన్నత విద్యాలయం, పోస్ట్ ఆఫీసు, కస్టమ్స్ మరియు ఓడ రేవు కార్యాలయాలు కూడా ఉండేవి. ఇక రామాలయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం పూజలతో కళకళలాడుతూ ఉండేసి.


1964 డిసెంబర్ 22 అర్ధ్రరాత్రి ఎం జరిగింది?
                                  1964 డిసెంబర్ 17 న దక్షిణ అండమాన్ ( బంగాళాఖాతం) సముద్రం లో ఏర్పడిన అల్ప పీడనం డిసెంబర్ 19 కి తుఫానుగా రూపాంతరం చెందింది. డిసెంబర్ 22 నాటికి దాదాపు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ధనుష్కోటి పట్టణాన్ని చుట్టి వేసింది. దాదాపు 5 మీటర్ల మేర ఎగసిపడిన అలలు సముద్ర మట్టానికి కేవలం 2 నుంచి 3 మీటర్ల ఎత్తులో ఉండే ధనుష్కోటి పట్టణం మీద విరుచుకు పడ్డాయి. అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఆలల ఉధృతికి భీకరమయిన గాలులు తోడవడంతో కేవలం అరగంట వ్యవధిలో ధనుష్కోటి పట్టణం అంతా నేలమట్టం అయిపొయింది. కేవలం కొన్ని ప్రభుత్వ భవనాల మొండి గోడలు మాత్రమే మిగిలాయి. ఊరు మొత్తం ఇసుక మరియు శవాల దిబ్బగా మారింది. ఇసుకలోనుంచి అన్ని శవాలను బయటికి తీయడానికి దాదాపు వారం రోజులు పట్టిందట. తుఫాను రాకను ముందుగా పసిగట్టి దూరప్రాంతాలకు వెళ్ళిన కొంతమందిని మినహాయిస్తే దాదాపు ఆ రాత్రి ఆక్కడ ఉన్నవాళ్ళందరి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. 1915 మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది .

ఆ రోజు ధనుష్కోటి వెళ్ళే పంబన్- ధనుష్కోటి పాసింజర్ రైలు గమ్యం చేరిందా...??? 
                           పంబన్ నుంచి  110 మంది ప్రయాణికులతో 5 గురు రైల్వే సిబ్బందితో  బయలుదేరిన రెగ్యులర్ పాసింజర్ రైలు( ట్రైన్ నంబర్ 653 )మరికొద్ది క్షణాల్లో రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది అన్న సమయంలో అటుగా వచ్చిన భయంకరమయిన అలల ధాటికి సముద్రం లోకి  కొట్టుకు  పోయింది . ఆ సమయంలో  ట్రైన్ లో  ఉన్నసిబ్బందితో సహా అందరూ  జల సమాధి అయ్యారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడం వలన పర్యాటకుల సంఖ్య తక్కువగా ఉందని లేకపోతే మరింతమంది చనిపోయి ఉండే వారని రైల్వే అధికారులు చెప్పారు.




ఆనాటి దుర్ఘటనకు మూగ సాక్ష్యాలు: ఫోటోలు:

చర్చి అవశేషాలు:

గుడి అవశేషాలు :


రైల్వే స్టేషన్ మరియు రైల్వే ఆసుపత్రి అవశేషాలు:


రైలు పట్టాల అవశేషాలు:


ఫెర్రీ సర్వీసు నడిపింది ఇక్కడి నుంచే:


ఘోస్ట్ టౌన్ గా ప్రకటించిన మద్రాసు ప్రభుత్వం.
                           ఈ దుర్ఘటన జరిగిన తరువాత మద్రాసు ప్రభుత్వం ధనుష్కోటి పట్టణం నివాస యోగ్యం కాదని , దానిని ఘోస్ట్ టౌన్ గా ప్రకటించడంతో ధనుష్కోటి పట్టణం చరిత్ర లో కలిసిపోయింది. 


ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ? 
                         ఇప్పుడు అక్కడ కేవలం 5 -6 కుటుంబాల వారు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. అక్కడికి వచ్చిన యాత్రికులకి మంచి నీరు, తిను బండారాలు అమ్మి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ పర్యాటకరంగం మొగ్గ తొడుగుతుంది. ధనుష్కోటి వరకు నాలుగు లైన్ల రోడ్ వేయాలని, ధనుష్కోటి నుంచి శ్రీలంకకు  ఫెర్రీ సర్వీసులు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇవన్నీ జరిగి ధనుష్కోటికి పూర్వ వైభవం వస్తుందని ఆశిద్దాం.

భారతదేశపు తొలి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జి వివరాలకోసం ఈ లింకు నొక్కండి.  http://drvenkatasubbareddy.blogspot.in/2012/02/blog-post_5699.html

Tuesday, February 28, 2012

భారత దేశపు తొలి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జి విశేషాలు..ఇంజనీరింగ్ అద్భుతం ..!!!


                    రామేశ్వరానికి వెళ్ళేదారిలో కనిపిస్తుంది ఈ పంబన్ రైలు మరియు రోడ్  బ్రిడ్జి.ఈ వంతెన  రామేశ్వరం ద్వీపాన్ని మరియు భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది .రైలు వంతెనలు సాధారణం గానే ఉండేవి కదా అని అనుకుంటున్నారా.....!!! నిజమేనండి...కానీ ఈ వంతెన కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండోయ్.... అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి . 

  • ఈ పంబన్ బ్రిడ్జి భారతదేశపు తొలి సముద్రపు వంతెన, 
  • దీని నిర్మాణం బ్రిటిష్ వారికాలం లో 1887 లో మొదలయి 1912 లో పూర్తయింది.
  • భారత దేశం లో ఉన్న సముద్రపు వంతెనలలో ఇది రెండవ అతి పెద్ద సముద్రపు వంతెన.( మొదటిది ముంబై లో ఉన్న బాద్ర- వర్లి సముద్రపు వంతెన) 
  • ఈ వంతెన దాదాపు 2 కిలోమీటర్ల (2065 మీటర్లు) పొడవు ఉంటుంది. ఇది సముద్రం మీద palk జలసంధి మీద నిర్మించారు కాబట్టి ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి మధ్య భాగం రెండుగా విడివడి పైకి లేస్తుంది.( ఫోటో చూడండి)

  • ఈ వంతెన 2007 కి ముందు మీటర్ గేజ్ మార్గం గా ఉండేది. 2007 ఆగష్టు 12 న బ్రాడ్ గేజ్ మార్గం గా మార్చడం జరిగింది.
  • ఈ బ్రిడ్జి సముద్ర ఉప్పునీటి గాలుల వలన తుప్పుపట్టే అవకాశం ఉన్నాదాదాపు శతాబ్ద కాలం గా  తట్టుకుని నిలబడి ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
  • ఈ బ్రిడ్జి ఉన్న ప్రదేశం అతివేగంగా గాలులు వీచే తుఫాను ప్రభావిత ప్రాంతం లో ఉంది.రైలు లో ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేసేటప్పుడు పడిపోతామేమో అనే భయం కూడా కలుగుతుంది. ( నేను అనుభవించాను కూడా )
  • ఈ బ్రిడ్జి కి 143 స్థంబాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జి మధ్య భాగాన్ని స్విచ్చర్స్ బ్రిడ్జి అంటారు. 
  • ఈ బ్రిడ్జి పక్కనే 1989  లో రోడ్ వంతెనని కూడా అందుబాటులోకి తెచ్చారు.అప్పటి వరకు ఈ రైలు మార్గాన్నే భారత  ప్రధాన భూభాగానికి మరియు రామేశ్వరం, ధనుష్కోటి ద్వీపానికి రాకపోకలకు వినియోగించేవారు.
  • ఈ వంతెన మీద భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళని కూడా విడుదల చేసింది.

  • ఈ వంతెన ప్రవేశం వద్ద ఒక వ్యక్తి  ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకుని నిలబడ్డట్లు ఉంటుందట. ఈ బొమ్మ  గురించి రకరకాల పుకార్లు కూడా ప్రచారం లో ఉన్నాయండోయ్. అందులో అత్యంత ప్రచారం పొందిన పుకారుని ఇక్కడ రాస్తున్నా చూడండి.
                                  ఓడలు వచ్చినపుడు బ్రిడ్జి మధ్య భాగాన్ని పైకి లేపడానికి బ్రిటిష్ వారికాలం లో ఒక మధ్య వయస్కుడిని నియమించారట. ఒక సారి ఓడ వెళ్ళిన తరువాత ఆ వ్యక్తి ఆ వంతెనను సాధారణ స్థితి కి తెస్తుండగా ఒక రైలు రావడం గమనిన్చాడట. ఆ వ్యక్తి ఆ వంతెనను సాధారణ స్థితిలోకి తీసుకు వచ్చేందుకు అతివేగంగా పుల్లీలను తిప్పడం మొదలెట్టాడట. అతను అలా చేయక పోతే ఆ రైలు సముద్రం లో పడిపోయి వేలాది ప్రాణాలు నీటిలో కలిసిపోతాయి.ఈ సమయం లో అతని 9 సంవత్సరాల కుమారుడు ఆ వ్యక్తికి భోజనం తీసుకుని వచ్చాడు. తండ్రి కష్టపడటం చూసి తను కూడా ఆ పుల్లీలను తిప్పడంలో సహాయం చేయసాగాడట. అయితే దురదృష్టవశాత్తు ఈ పుల్లీలను తిప్పే క్రమంలో ఆబాలుడి  చేయి ఆ పుల్లీలకు కలుపబడిన వైర్లలో పడిందట. ఆ బాలుడు నొప్పితో ఏడవ సాగాడట. అయితే వేలాది ప్రాణాలకంటే తన కుమారుడి ప్రాణాలు ముఖ్యం కాదనుకున్న ఆ వ్యక్తి బాలుడి ఏడుపుని పట్టించుకోకుండా ఆ     పుల్లీని తిప్పి బ్రిడ్జి ని సాధారణ స్థితికి తెచ్చి రైలు లో ఉన్న అందరి ప్రాణాలు కాపాడాడట. ఈ లోగా ఆ యంత్రంలో పది ఆ వ్యక్తి కుమారుడి ప్రాణాలు పోగొట్టుకున్నాడట. ఈ వ్యక్తి గొప్పతనాన్ని మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ వంతెన ద్వారం వద్ద ఆ వ్యక్తి బొమ్మని పెట్టిందట. ఈ బొమ్మ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకుని నిలబడ్డట్లు ఉంటుందట.

    ఇవండీ పంబన్ బ్రిడ్జి విశేషాలు..... ధనుష్కోటి విశేషాలతో మరొక టపాలో కలుద్దాం...!!!

    Saturday, February 25, 2012

    ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మెదడులో ఎలాంటి రసాయనిక మార్పులు జరుగుతాయి....!!! ఆత్మహత్యా భావం వారసత్వంగా వస్తుందా....!!!ఆత్మహత్యల గురించి ఆసక్తికర విషయాలు...విశ్లేషణ....!!!


                          నిన్న నా పి.జి పరిక్షలకు సన్నద్దమవటంలో భాగంగా ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతుంటే ఆత్మహత్యల గురించి ఆ పుస్తకంలో ఉంది . ఆత్మహత్యల మీద సమాచారం బ్లాగర్లతో పంచుకుందాం అనే ఉద్దేశంతో అంతర్జాలం నుంచి, నా మెడికల్ పుస్తకాల నుంచి మరింత సమాచారం సేకరించి క్లుప్తంగా ఈ టపా రాస్తున్నాను.








    ఆత్మహత్యల గురించి మనకు తెలియని నిజాలు:
    1. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షలమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు.
    2. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకుని మరణించే  వారి సంఖ్య 13 వ స్థానం లో ఉంది.
    3. ఆత్మహత్య చేసుకునే స్వభావం స్త్రీలలో కంటే పురుషులలో మూడు నించి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
    4. యుక్తవయస్కులు మరియు 35  సంవత్సరాల లోపు వారే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.



                                ఇక ఆత్మహత్యకు దారితీసే కారణాల గురించి చెప్పుకుంటే , ఆత్మహత్య చేసుకోవడానికి మానసిక వత్తిడి ప్రధాన కారణం. మానసిక వత్తిడికి దారితీసే కారణాల్లో జీవిత భాగస్వామితో సమస్యలు మొదటి స్థానంలో ఉండగా వ్యక్తిగత ఆరోగ్యకారణాలు, ఉద్యోగ కారణాలు, ఆర్ధిక ఇబ్బందులు తరువాత స్థానాల్లో ఉన్నాయి. వీటితో  పాటుగా మానసిక వ్యాధిగ్రస్థులు, మద్యానికి బానిస అయిన వాళ్ళుడ్రగ్స్ కి  అలవాటు పడిన వాళ్ళలో కూడా ఆత్మహత్యా స్వభావం ఎక్కువగా ఉంటుంది.

    ఆత్మహత్య చేసుకోబోయే ముందు మెదడులో ఎలాంటి జీవ రసాయన చర్యలు జరుగుతాయి:

                        ఈ విషయం మీద పెద్ద పరిశోధనే జరిగింది. చివరకు ఆ పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారి మెదడులో సెర టోనిన్ ( బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటార్) స్థాయి సాధారణ వ్యక్తుల సెరటోనిన్ స్థాయితో పోలిస్తే తక్కువగా ఉందని. అలాగే ఆత్మహత్య చేసుకుని మరణించిన వారి మెదడులో సెరటోనిన్ స్థాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారి సెరటోనిన్ స్థాయి కంటే ఇంకా తక్కువగా ఉందని కూడా తేలింది. ఈ హెచ్చు తగ్గులన్ని  మెదడులోని ventro medial pre fontal cortex  లో జరుగుతాయి. అయితే ఎటువంటి మానసిక వత్తిడి లేకుండా కేవలం సెరటోనిన్ స్థాయి తగ్గిపోయినా కూడా ఆత్మహత్యా స్వభావం వస్తుందని , ఇది వారసత్వం గా సంక్రమిస్తుందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. ఆత్మహత్యల గురించి మీడియా లో పదే పదే చూపించడం కూడా సాధారణ వ్యక్తిలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ కలిగిస్తుందని చాలా పరిశోధనలు చెపుతున్నాయి.


    ఆత్మహత్యలను ఎలా నివారించవచ్చు ???

                

                 









             



                      సమస్యని పరిష్కరించడం ద్వారా, బాధితులకు మనోనిబ్బరం కలిగించడం ద్వారా, మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించడం ద్వారా, మనస్తత్వశాస్త్ర నిపుణుడిని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా ఇలాంటి ఆత్మహత్యా భావాలు రాకుండా నివారించ వచ్చు.

    Thursday, February 23, 2012

    మూడు కొత్త ఛుక్ ఛుక్ బండ్లు వస్తున్నాయి, మీ ఊరికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి...!!!

                      
                                  మన ఎంపి ల వత్తిడి ఫలితమో లేక మన అదృష్టమో తెలియదు గాని వచ్చే వారం మన రాష్ట్రానికి మూడు  కొత్త రైళ్ళు రాబోతున్నాయి. ఎప్పుడు బీహార్, పశ్చిమ బెంగాల్ వైపు పరిగెత్తే రైళ్ళు ఈ సారి మన వైపు రావడం తెలుగు ప్రజలకు ఆనందం కలిగించే విషయమే...!!! ఇంకెందుకు ఆలస్యం, ఆ రైళ్ళ వివరాలు చుసేయండి.
    1) హౌరా -మైసూరు -హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ :
                                ఈ ట్రైన్ (నెంబర్ : 22817 ,22818 ) 24 ఫిబ్రవరి 2012 నుంచి మొదలవుతుంది. మన రాష్ట్రం లో పలాస, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి , ఏలూరు,విజయవాడ ,రేణిగుంట , మార్గం గుండా వెళ్తుంది. 
    2) షాలిమార్- సికిందరాబాద్- షాలిమార్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్:
                              ఈ రైలు( నెంబర్ :22849 ,22850 ) కూడా 24 ఫిబ్రవరి 2012 నుంచి మొదలవుతుంది. సికిందరాబాద్ నుంచి ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5 .30 కి బయలుదేరుతుంది. మనరాష్ట్రంలో  ఖాజీపేట, వరంగల్, విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం,పలాస , సోంపేట స్టేషన్ లలో ఆగుతుంది.
    ౩) మంగుళూరు  - సంత్రగాచి  - మంగుళూరు వీక్లీ ఎక్స్ ప్రెస్ :
                              ఈ రైలు (నెంబర్ : 22851 ,22852 ) ఫిబ్రవరి 25వతేదీ నుంచి మొదలవుతుంది. మనరాష్ట్రం లో ఈ రైలు సోంపేట, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి ,ఏలూరు, విజయవాడ, ఒంగోలు,నెల్లూరు, గూడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది. మన రాష్ట్రంగుండా  ఈ రైలు ఆదివారం మరియు  సోమవారం లలో వెళుతుంది.
                              అయితే ఈ రైళ్ళు అన్ని కోస్తా ప్రాంతం నుంచే ప్రయాణించడం గమనార్హం. రాష్ట్రం లో మిగిలిన ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్ళు తీసుకురావడానికి మన ఎంపి లు కృషి చేస్తారని ఆశిద్దాం.
                             





    Thursday, February 16, 2012

    చాకోలేట్లతో అద్భుతమయిన రూపాలు ( చిత్రాలతో సహా)...!!! కరిగి పోక ముందే ఒక లుక్కెయ్యండి...!!!

    1)మీ స్వీట్ హార్ట్ ని మీకు నచ్చిన వారికి ఇచ్చేయండి....!!! 





    2) చాకొలేట్ పనిముట్లు : 




    3) చాకోలేట్లతో రాతి నిర్మాణాలు :




     4) కుక్కలే కాదు మనుషులు కుడా బూట్లను కూడా తినేయొచ్చు:



    5) తను కరిగిపోక ముందే తినేయాలి మరి ....!!!




    6) గోర్లు కత్తిరించుకునే సెట్:




    7) చాకొలేట్ తో ఇలా చెక్ పెట్టేయోచ్చు :




    8) కెమెరా :



    9) మగ వారికేనా బూట్లు, ఆడవారికోసం హీల్స్ కూడా :



    10) ఆగండి...అయిపోలేదు... చేతికి బేడీలు వేయించుకుని తింటూ ఈ పేజి క్లోజ్ చేయండి:

    Wednesday, February 08, 2012

    సుమ యాంకరింగ్ శృతిమించుతోందా....!!! స్థూలకాయుల మనోభావాలు దెబ్బతింటున్నాయా...!!!

                         
                     తన చలాకీతనంతో, సమయస్ఫూర్తితో, సందర్భోచిత వ్యాఖ్యానంతో, అందరిలో కలిసిపోయి నవ్వులు పూయించే సుమ, యాంకరింగ్ రంగం లోనికి ప్రవేశించే వారికి స్ఫూర్తిగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేరళ నుంచి వచ్చి కూడా తెలుగు భాష మీద పట్టు సాధించి , స్పష్టంగా మాట్లాడుతూ ఇప్పుడున్న తెంగ్లిష్ మాట్లాడే వారందిరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ టి.వి లో స్టార్ మహిళ( 1000 ప్లస్) మరియు జీన్స్ ,మా టివి లో భలేచాన్సులే, జీ తెలుగులో భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, టివి 9 లో పంచావతారం వంటి షోలను అలవోకగా నడిపిస్తున్న సుమ యాంకరింగ్ ఈ మధ్య కొంచెం శృతి మించుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆవిడ వీరాభిమాని అయిన మా ఆవిడ కూడా నాతో ఈ మాట అనడం నన్ను ఈ టపా రాయడానికి ప్రేరేపించింది.
                        అసలు విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా ఒక ఛానల్లో ప్రసారం అవుతున్న పాము నిచ్చెన ఆటలో సుమగారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందులో జంబో అనే క్యారెక్టర్ పట్ల సుమ గారు, ఆ ఆటలో పాల్గొనడానికి వచ్చిన సెలెబ్రిటిలు వ్యవహరించే తీరు స్థూలకాయులను మనోవేదనకు గురిచేసాలా ఉందని అనిపిస్తుంది. జంబో అని పిలవడం ఒక ఎత్తయితే, చీటికి మాటికి జంబో స్థూలకాయాన్ని ఉద్దేశించి సుమగారు చేసే వ్యాఖ్యలు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. జంబోని కాలితో తన్నడం, నేల మీద పడుకో పెట్టించి సెట్లో ఉన్న వాళ్ళందరితో పైకి లేపించడం, జంబో నీ బరువెంత అని మళ్లీ మళ్లీ అడగటం, జంబోని వంగోమని అడిగి( ఒక ఆటలో భాగంగా) వంగోబోయే లోపు పాంట్ చిరిగినట్టు పర్ మని శబ్దం చేయడం వంటి సంఘటనలు కేవలం మచ్చుకు మాత్రమే. స్థూలకాయమ్ ఉన్నవాళ్ళు కామెడి చేయడం ఇంతకుముందు చాలా చిత్రాలలో ఉన్నప్పటికీ టెలివిజన్ చరిత్రలో ఇదే ప్రధమం అనుకుంటా.
                        ఏ సందర్భాన్నయినా తన మాటల చాతుర్యంతో పండించే సుమ ఇలా జంబో మీద ఎందుకు పడిందో అర్ధం కావడం లేదు. ఏదేమయినా ఆంధ్రుల అభిమాన యాంకర్ గా  పేరొందిన సుమ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మరింత ఆదరాభిమానాలు పొందుతుందని నా అభిప్రాయం.

    Monday, February 06, 2012

    MRP కే మద్యం....మందు బాబులకు హాంగ్ ఓవర్ తంటా...!!!


                        ఈ మధ్య కాలంలో నేను ఒక విచిత్రమయిన పరిస్థితిని చూస్తున్నాను . అదేమిటంటే నా దగ్గరకు వచ్చే చాలా మంది  పేషెంట్స్ హాంగ్ఓవర్ అని కంప్లైంట్  చేస్తున్నారు. కారణం ఏమిటా అని ఆరా తీస్తే  ACB దాడులకు భయపడి మద్యం సిండికేట్లు మద్యాన్ని MRP  ధరకే అమ్ముతున్నారని తెలిసింది. ఇంకేముంది... అప్పటివరకు 120/130  రూపాయలకు కొన్న క్వార్టర్ బాటిల్ కేవలం 80 రూపాయలకే లభిస్తుండే సరికి మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రోజూ రెండు క్వార్టర్లు పీకే వారు అదే డబ్బులతో మూడు క్వార్టర్లు పీకటం మొదలెట్టారు. అలా హాంగ్ఓవర్ బారిన పడేవాళ్ళు ఎక్కువయ్యారు.( నా బిజినెస్ కూడా బాగా పెరిగింది లెండి...!!!). అందుకే హాంగ్ ఓవర్ గురించి బ్లాగర్లకు చెబుదామనిపించి ఈ టపా రాస్తున్నాను.
    హాంగ్ ఓవర్ ఎలా వస్తుంది...? లక్షణాలు ఎలా ఉంటాయి?
                  హాంగ్ఓవర్ అనేది అధిక మొత్తంలో మద్యము తీసుకున్న తరువాత మందుబాబులు అనుభవించే ఒక పరిస్థితి . వాస్తవంగా మద్యం ప్రభావం నుంచి మనిషి బయటకు వస్తున్నపుడు ఈ స్థితి వస్తుంది. చాలా మంది నిపుణులు మద్యం తయారు చేసేటపుడు అందులో కలుపబడే కొన్ని రకాల పదార్ధాల వలన హాంగ్ఓవర్ వస్తుందని చెపుతారు. మద్యంలో కలుపబడే ఈ పదార్ధాలను కాంజీనేర్స్ 
    Congeners ) అంటారు


    హాంగ్ఓవర్ ని ఎలా తగ్గించు కోవచ్చు...?
                  పురాతన కాలంలో హాంగ్ఓవర్ ని తగ్గించడానికి మిర్ అనే ఒక రసాయనం మరియు పక్షుల యొక్క ముక్కు ని మెత్తని మిశ్రమంగా కలిపి ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి మిశ్రమాన్ని వాడటం మంచిది కాదని నిపుణులు తేల్చేసారు. హాంగ్ఓవర్ కి చికిత్స లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు. అధిక శాతం ఆల్కహాల్ కలిగి వున్న విస్కీ మరియు బ్రాందీలను సేవించడం మాని తక్కువ మోతాదులో ఆల్కహాల్ వుండే వోడ్కా మరియు జిన్ వంటివి సేవించడం ద్వారా ఈ హాంగ్ఓవర్ బారినుండి బయట పడవచ్చు. రసాయన పదార్ధాలు కలిపిన అన్ని రకాల మద్య పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. సాధారణంగా రెడ్ వైన్ అధికంగా సేవించడం ద్వారా వచ్చే హాంగ్ఓవర్ చాలా దారుణంగా ఉంటుంది. ఇలా అధిక మొత్తంలో మద్యం సేవించి హాంగ్ఓవర్ వచ్చిన వాళ్ళు తరువాత రోజు అధిక కోపంతోనునీరసించి పోయి వుంటారు.
                 కాబట్టి మద్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి కానీ మద్యం మనల్ని ఎంజాయ్ చేయకుండా చూసుకోవడం మంచిది. అంతే కదండీ....!!!!

    Wednesday, February 01, 2012

    మనకు తెలియని ఆసక్తికర నిజాలు-- నాల్గవ భాగం

    మరిన్ని ఆసక్తికకర నిజాలతో మరో టపా మీ ముందుకు వచ్చిందండీ....
    ఇక ఆలస్యం దేనికి...చదివేయండి...!!!
    1. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకానికి కూడా ఒక రికార్డు ఉందంట... అదేంటో తెలుసండీ...గ్రంధాలయాలనుంచి అత్యధికంగా, అతి తరచుగా దొంగతనం చేయబడే పుస్తకం ఇదేనటండోయ్...!!!
    2. తేలు మీద కొంచెం అల్కాహాలు వేస్తే , వెంటనే పిచ్చెక్కి దాని కొండె తో అదే కరుచుకుని చనిపోతుందట...!!! ఈ సారి తేలు కనిపిస్తే కర్రతో కొట్టకుండా కొంచెం ఆల్కహాల్ తో కొడతారు కదూ...!!!
    3. వ్యోమగాములు అంతరిక్షం లోనికి వెళ్లేముందు బీన్స్ తినడం నిషేధం అట....ఎందుకంటారా... స్పేస్ సూట్ లో గ్యాస్ వదిలితే అది పాడవుతుందట...!!! 
    4. చాక్లెట్లు కుక్కల నాడీ వ్యవస్థమీద మరియు హృదయం మీద ప్రభావం చూపిస్తాయట. ఒక చిన్న సైజు కుక్కని చంపడానికి కేవలం కొన్ని ఔన్సుల చాకొలేట్ సరిపోతుంది.
    5. మన జీర్ణాశయం లో ప్రతి రెండు వారాలకొక సారి కొత్త మ్యూకస్ పొర తయారవుతుంది.ఎందుకంటే ఆహారం జీర్ణం అయే ప్రక్రియలో మ్యూకస్ పొర పాడవుతుంది.
    6. అగ్గిపుల్ల కంటే సిగరెట్ లైటర్ ని ముందు కనిపెట్టారట...!!!
    7. ఆవుని మెట్లు  ఎక్కించవచ్చు కానీ మెట్ల మీదుగా కిందకి దింపడం అసాధ్యమట...!!!
    8. తెలివయిన వ్యక్తుల వెంట్రుకలలో జింక్ మరియు కాపర్ పాళ్ళు అధికంగా ఉంటాయట...!!!
    9. చిమ్మటలు/ పట్టు పురుగులు భూకంపం వచ్చినపుడు పైకి ఎగరలేవట...!!!
    10. అంటార్కిటికా లో ఇప్పటివరకు నమోదయిన అత్యధిక ఉష్ట్నోగ్రత 3 డిగ్రీల ఫారెన్ హీట్ మాత్రమేనట...!!!  
    మరికొన్ని ఆసక్తికర నిజాలతో మరో టపాలో కలుద్దాం....!!!