Friday, December 09, 2011

గొప్పలు చెప్పుకుంటే వచ్చే కష్టాలు

ఈ మధ్య కాలం లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ను నిర్మించిన నిర్మాత ఇంటి మీద ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు నిన్న దాడి చేసారు. ఆ తర్వాత ప్రముఖ హీరో గారి ఇంటికి కూడా వెళ్లి ఇల్లంతా సోదాలు చేసినట్లు సమాచారం. దీనంతటికి కారణం వాళ్ళు మా సినిమా అత్యధిక వసూళ్ళు సొంతం చేసుకుంది అని ప్రకటనలు గుప్పించటమే  కారణం. ఏదేమయిన సదరు నిర్మాతలకు తగునా శాస్త్రి జరిగిందని తెలుగు సినిమా అభిమానులు సంబర పడుతున్నారు. ప్రచారం చేసుకోవడం లో తప్పు లేదు కానీ నిజాయితిగా  ఆదాయపు పన్ను చెల్లించి వుంటే వారు ప్రకటించిన వసూళ్ళు అన్ని నిజమని తెలుగు ప్రజలకు నమ్మకం కలిగేది.ఏమంటారు....!!!!

3 comments:

  1. నిజమే నండి.అన్నట్టు తెలుగు బ్లాగు లోకానికి స్వాగతం.నాదే మొదటి కామెంటు లాగుంది.

    ReplyDelete
  2. రక్త చరిత్ర సినిమా గురించి కూడా అలాగే ప్రచారం చేసుకున్నాడు నిర్మాత.

    ReplyDelete
  3. హ హ హ
    బాగుంది మీ సత్యశోధన!!

    ReplyDelete